మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి రైతులు చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి ఉద్యమ పోరు నేటికి 477 వ రోజుకు చేరుకున్నది.
మహిళా దినోత్సవం రోజున విజయవాడ ప్రకాశం బ్యారేజి దగ్గర నిరసన వ్యక్తం చేయాలని అమరావతి మహిళా రైతులు భావించారు.
అయితే పోలీసులు నిరసన ర్యాలీని అడ్డుకొని అమరావతి రైతులను అరెస్టు చేశారు.
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని తాము చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారని అమరావతి దళిత (జె ఏ సి) నేత పులిచిన్న తెలిపారు.
మహిళాదినోత్సవం రోజున కూడా మహిళలకు తమ భావ ప్రకటన వ్యక్తం చేసే స్వేచ్ఛ లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఏమనాలో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి ఉద్యమానికి ప్రతిక అయిన మహిళలను అరెస్టు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వ ఫాసిస్టు చర్యకు ఉదాహరణ అని ఆయన అన్నారు.