మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ తిలక్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం లోని మల్కాపురం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో హార్బార్ సహాయ కమిషనర్ శిరీష సీనియర్ జర్నలిస్ట్ తిలక్ మల్కాపురం సి. ఐ లూథెర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని చెల్లిగా అక్కగా అమ్మగా అత్తగా అవ్వగా తన జీవితాంతం ఎన్నో పాత్రలు పోషించగల స్త్రీ కు పెద్దపీట వేయాలని తెలిపారు.
ఏసీపీ శిరీష మాటలు ఆడుతూ ఆపదలో చిక్కుకున్న మహిళలు సహాయం కోరిన వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని రక్షణ కల్పించే వ్యవస్థ కొరకు వినూత్నమైన ఫీచర్లతో,ఆధునిక సాంకేతిక వ్యవస్థతో రూపొందించిన’దిశ’ మొబైల్ యాప్ ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఈ ”యాప్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతూ జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులను పొందినన్నారు.
సీఐ లూథెర్ బాబు మాట్లాడుతూ ప్రతి మహిళా తన కుటుంబానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేమని, సమాజ అభివృధ్దిలోను, కుటుంబాలను తీర్చిదిద్దడంలోను మహిళల విధేయతకు విలువకట్టలేము అన్నారు. సోషల్ మీడియా పట్ల మహిళలో జాగ్రత్త గా ఉండాలని ఈరోజుల్లో రోజు చాలా మంది మహిళలు సోషల్ మీడియా వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తగు జాగ్రత్తలు తీసుకువాలని చెప్పారు.. అనంతరం వుమన్ కౌన్సెర్స్ సచివాలయ సిబ్బందికి మెమెంటోలు ఏసీపీ సీఐ లు అందచేశారు.