మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర సెర్ఫ్ సిఇఓ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శితో కలిసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిక చేయబడిన జిల్లాల కలెక్టర్లతో మహిళా సంఘాల పనితీరు , అభివృద్ది పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరానికి లక్ష ఆదాయం కల్పించే మహిళా సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాదులు కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేసి, పేదరిక నిర్మూలన ధ్యేయంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 8 జిల్లాలను ఎంపిక చేసినట్లు, అందులో ఖమ్మం ఒక జిల్లా అని అన్నారు. మహిళా ఆర్థిక సాధికారత తో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో పాటు అన్నీ జిల్లాల కలెక్టర్ లు, డిఆర్దిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————-