బ్లాక్ ఫంగస్ సోకితే బతికే అవకాశం లేదా? లేదనే అనుమానంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో జరిగింది.
బుల్లిమావతి అనే 48 ఏళ్ల మహిళకు ఆమె భర్తకు కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆ తర్వాత భర్తకు బ్లాక్ ఫంగస్ సోకింది.
ఈ విషయం పరీక్షల్లో తేలింది. దాంతో బ్లాక్ ఫంగస్ వస్తే తన భర్త బతకడని ఆమె నిర్ధారణకు వచ్చింది. ఇద్దరూ ఈ నెల 20 వ తేదీ నుంచి చికిత్స పొందుతున్నారు.
అయితే తన భర్త ఎలాగూ బతకడు అని మనస్తాపంతో భార్య ఉరేసుకుని మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.