గాజువాక శ్రీరామ్ నగర్ లో భవాని(25) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కరాలకు చేసేందుకు పూనుకున్నారు.
విషయం కాస్త పోలీసులకు తెలియడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.