ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లోని కేస్లాపూర్ లోని నాగోబా ఆలయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవ రాజన్ గురువారం సందర్శించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణం పనులను పరిశీలించిన ఆమె వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆమెను మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయీ, ఆలయ కమటీ సభ్యులు సన్మానించారు.