మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగాలని హుజూర్నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి చైర్ పర్సన్ అర్చనా రవి కేకును కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు అట్లూరి మంజుల ,వీర్లపాటి గాయత్రి, కుంట ఉపేంద్ర, V త్రివేణి, గుంజ భవాని, కారంగుల విజయ తదితరులు పాల్గొన్నారు.