మహిళలు అన్ని రంగాల్లో ఘన విజయాలు సాధిస్తూ తామేంటో నిరూపించుకున్నారని, ఇలాగే ముందుకు సాగిపోవాలని జై భారత్ మాత సేవాసమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లద్దే నాగరాజు అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి కేపీ.హెచ్.బి కాలనీ లోని జై భారత్ మాత సేవాసమితి కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటికి సమాజంలో మహిళలు కొంత వివక్షకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సముచిత స్థానం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.