టీఆర్ ఎస్ పార్టీ ఎం ఎల్ సి అభ్యర్థి సురభి వాణిదేవి కిఇప్పటికే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నదని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మాధవరం సెరినిటీ అపార్ట్ మెంట్ లో లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన పట్టభద్రుల సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర బేవరేజ్ చైర్మన్ దేవిప్రసాద్, గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజమౌళి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు నడిచి విజయం సాధించే దిశగా కార్యక్రమాలు తీసుకుందామని కోరారు.
పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వాణిదేవిని గెలిపించుకోవాలని ఆయన కోరారు. ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారాలు చేయడమే తన పనిగా పెట్టుకున్నదని, మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్ల నీరు అందిస్తే అది తమ ఘనతగా చెప్పుకుంటున్నది బీజేపీ నాయకత్వం.
వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తమ ఆసత్యాలను పంచుకుంటున్నదని సుధీర్ రెడ్డి అన్నారు. బీజేపీ అసత్యాల ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్క విద్యావంతులు మననం చేసుకొని వారికి బలంగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తిలక్ రావు,గోపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు.