అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని మల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు పల్లా కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన పల్లా కిరణ్కుమారెడ్డి మాట్లాడుతూ గతంలో డివిజన్ అధ్యక్షుడుగా పనిచేసి ఎన్నో అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు బేతి సుభాష్రెడ్డి, కార్పోరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి ల సహకారంతో డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యుల వివరాలు డివిజన్ అధ్యక్షుడుగా పల్లా కిర్ణ్కుమార్రెడ్డి, జనరల్ సెక్రటరీ వాసుదేవగౌడ్, కోశాధికారిగా దుర్గామాధవి, మహిళా అధ్యక్షురాలుగా కోటేశ్వరి, మహిళా జనరల్ సెక్రటరీగా తులసి , మహిళా ఉపాధ్యక్షరాలుగా మంజుల, నరసింహ, యూత్ అధ్యక్షుడుగా శీతల విజయ్కుమార్గౌడ్, యూత్ ఉపాధ్యక్షుడుగా జయరాజు, కార్మకవిభాగం అధ్యక్షుడుగా రామాంజినేయులు, జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ ఎన్నికయ్యారు.