34.2 C
Hyderabad
April 19, 2024 19: 01 PM
Slider హైదరాబాద్

డివిజన్‌ అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తా: పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి

#kirankumarreddy

అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని మల్లాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన అధ్యక్షులు పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన  పల్లా కిరణ్‌కుమారెడ్డి మాట్లాడుతూ గతంలో డివిజన్‌ అధ్యక్షుడుగా పనిచేసి ఎన్నో అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

ఉప్పల్‌ నియోజకవర్గం శాసనసభ్యులు బేతి సుభాష్‌రెడ్డి, కార్పోరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి ల సహకారంతో డివిజన్‌ను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు.  నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యుల వివరాలు డివిజన్‌ అధ్యక్షుడుగా పల్లా కిర్‌ణ్‌కుమార్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ వాసుదేవగౌడ్‌, కోశాధికారిగా దుర్గామాధవి,  మహిళా అధ్యక్షురాలుగా కోటేశ్వరి, మహిళా జనరల్‌ సెక్రటరీగా తులసి , మహిళా ఉపాధ్యక్షరాలుగా మంజుల, నరసింహ, యూత్‌ అధ్యక్షుడుగా శీతల విజయ్‌కుమార్‌గౌడ్‌, యూత్‌ ఉపాధ్యక్షుడుగా జయరాజు, కార్మకవిభాగం అధ్యక్షుడుగా రామాంజినేయులు, జనరల్‌ సెక్రటరీగా శ్రీకాంత్‌ ఎన్నికయ్యారు.

Related posts

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

Satyam NEWS

వేములవాడ మండలంలో కార్డన్ అండ్ సెర్చ్

Satyam NEWS

రాష్ట్ర రాజధాని భీమిలిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

Satyam NEWS

Leave a Comment