32.7 C
Hyderabad
March 29, 2024 12: 29 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ విలీన ప్రక్రియకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

IMG_0097

ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. ఈ వర్కింగ్ గ్రూప్ లో ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులు ఉంటారు. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ వర్కింగ్ గ్రూపును నియమిస్తూ జీవో ను జారీ చేశారు. వచ్చే నెల 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూపునకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు.. పోస్టులు.. డిజిగ్నేషన్ల ఏర్పాటుపై వర్కింగ్ గ్రూప్ దృష్టి సారిస్తుంది. అదే విధంగా జీతాల చెల్లింపులు.. పే-స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను కూడా వర్కింగ్ గ్రూప్ ఖరారు చేయనున్నది.

Related posts

ఏపి మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యానికి మహర్దశ

Satyam NEWS

కలుషిత జలాలపై స్పందించిన అధికారులు

Satyam NEWS

రుణ విత‌ర‌ణ మ‌హోత్స‌వం: సామాన్యుల‌కు సులువుగా రుణాలివ్వండి

Satyam NEWS

Leave a Comment