ఏసిఐసి – సిబిఐటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న 200 మంది విద్యార్థులకు గ్రామీణ సమాజం మరియు సవాళ్లను విద్యార్థులకు పరిచయం చేయడానికి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏసిఐసి – సిబిఐటి విభాగాధిపతి అన్నె విజయ రూరల్ కమ్యూనిటీ భావనను పరిచయం చేసి మరియు గ్రామీణ సంఘం అత్యంత ముఖ్యమైన సమస్యలను గుర్తించడం గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సమస్య కారణాలు మరియు వాటి ప్రభావాలను గుర్తించడానికి 30 సమస్య వృక్షాలు రూపొందించారు. సమస్య చెట్టును రూపొందించడానికి సమస్య-చెట్టు విశ్లేషణ సాధనంగా ఉపయోగించబడింది. తదుపరి చర్యగా 3 వేర్వేరు సమూహాలలో విద్యార్థులు 3 గ్రామాలను సందర్శించి, నిర్వచించిన సమస్యలను మ్యాప్ చేయడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి మరింత ఆలోచన చేస్తారని తెలిపారు. ఈ కార్య నిర్వహణ లో ఏసీఐసీ-సీబీఐటీ బృందం, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు సెషన్లో పాల్గొన్నారు.
previous post