రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. ఆయన పర్యటన నేడు ప్రారంభం అవుతోంది. పుతిన్ భారత్ పర్యటన గతంలో కంటే చాలా ముఖ్యమైనదిగా అంతర్జాతీయ పరిశీలకులు పరిగణిస్తున్నారు.
అమెరికాకు భారత్ దగ్గర కావడంతో రష్యాతో ఇబ్బందులు ఉన్నాయి. రష్యా అనేక విషయాలలో అమెరికాతో ఉద్రిక్తతలను కలిగి ఉంది. దీంతో అది అమెరికాతో భారతదేశపు సన్నిహిత సంబంధాలపై కూడా ఒక కన్నేసి ఉంచుతుంది. అయితే అమెరికాపై ఎక్కువ ఆధారపడటం సరికాదని భారత్ గతంలోనే గ్రహించింది.
రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకోకపోతే రష్యా క్రమంగా చైనాకు దగ్గరవుతుందని భారత్ కూడా గ్రహించింది. భారతదేశం రష్యా నుంచి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీ అలాగే అనేక రక్షణ ఒప్పందాల గురించి ఇప్పుడు ప్రధాని మోడీ పుతిన్తో చర్చించే అవకాశాలున్నాయి.