ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా శాంతిని ప్రేమించే పౌరులు (PEACE LOVING CITIZEN) అవార్డులను అందచేశారు. యునైటెడ్ పీస్ ఫెడరేషన్ న్యూయార్క్ అమెరికా, ప్రపంచ మానవ కమిషన్ ఫ్లోరిడా అమెరికా, సంయుక్తంగా యూత్ వెల్ఫేర్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మత సామరస్యానికి పెంపొందించేందుకు కార్యక్రమాలను చేపట్టిన డాక్టర్ పగడిపటి దేవయ్య, డాక్టర్ ఏం.ఏ.నజీబ్ లు అవార్డు అందుకున్నారు.
వీరితో బాటు యూత్ వెల్ఫేర్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ కి కూడా అవార్డు ప్రదానం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే గువ్వల బాల రాజు, GST డెప్యూటీ కమిషనర్ షీబా తదితరులు ఈ అవార్డులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో వైజాగ్ GST కమిషనర్ ఎండీ వసీం, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్ M శ్రీనివాస్, శ్రీ శ్రీ శ్రీ BHAU మహరాజ్, ఎంబిటి పార్టీ నాయకుడు అంజదుల్లా ఖాన్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి షాదాన్ మెడికల్ కాలేజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.