నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కల్వకుర్తి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్బంగా ఫోటోగ్రఫీ ప్రదాత లూయిస్ దాగోరే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు బియ్యం, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీడేను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ వారు కల్వకుర్తి లైన్స్ క్లబ్ భవన్ లో సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు.
అదే విధంగా వారికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఫోటో స్టూడియో యజమానులు లైన్స్ క్లబ్ వారు తదితరులు పాల్గొన్నారు.