37.2 C
Hyderabad
March 28, 2024 21: 08 PM
Slider ముఖ్యంశాలు

ప‌శు సంప‌ద‌ను మరింత పెంచుకునే ప్రణాళికలు సిద్ధం చేయాలి

#vijayanagaram

ప్ర‌పంచ వెట‌ర్న‌రీ దినోత్స‌వంలో విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ వ్యాఖ్య‌లు

ప్ర‌పంచ ప‌శు సంవ‌ర్ధ‌క దినోత్స‌వం సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్…కీలకమైన ప‌ద‌జాలాలు వాడారు. మూగ జీవాల‌కు సేవ చేయ‌డం అంటే భ‌గ‌వంతునికి సేవ చేయ‌డ‌మేనన్నారు.పశువుల‌తోనే సంప‌ద వృద్ది చందుతున్నారు. ఈ సంద‌ర్బంగా న‌గ‌రంలోని రింగ్  రోడ్ లో  లీ పేర‌డైజ్ లో పశుసంవ‌ర్ద‌క శాఖ  ఆధ్వ‌ర్యంలో ప్రపంచ వెటర్న‌రీ దినోత్స‌వం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ…జిల్లాలో ప‌శు సంప‌ద‌ను వృద్ది చేసేందుకు, ప‌శువైద్యులంతా కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ .సూర్య‌కుమారి పిలుపునిచ్చారు..

ప‌శువైద్యం ఎంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ గొప్ప వృత్తి అని… మూగ‌జీవాల‌కు సేవ చేయ‌డం భ‌గ‌వంతుని సేవ‌తో స‌మాన‌మ‌ని అన్నారు.. ప‌శువుల‌కు, జీవాల‌కు వైద్యం చేయ‌డంతోపాటు,  ఆ వైద్య శాస్త్రాన్ని నేర్చుకోవ‌డం కూడా చాలా క‌ష్ట‌మ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే స‌మాజంలో ప‌శువైద్యుల పాత్ర ఎంతో కీల‌క‌మ‌ని, వాటి నుంచీ మాన‌వుల‌కు సంక్ర‌మించే సుమారు 200 ర‌కాల వ్యాధుల‌ను నియంత్రించాల్సిన బాధ్య‌త వీరిపై ఉంద‌ని అన్నారు.

జిల్లాలో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంతోపాటుగా,  ప‌శువుల సంఖ్య‌ను వాస్త‌వికంగా పెంచేందుకు కృషి చేయాల‌ని, ఒక‌రివ‌ద్ద‌నుంచి మ‌రొక‌రికి ప‌శువుల‌ మార్పిడి కాకుండా,  కొత్త జీవాలను సృష్టించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. ప‌శుసంప‌ద‌ను పెంచితే, రైతుల ఆదాయం గ‌ణ‌నీయంగా పెర‌గ‌డ‌మే కాకుండా, పరోక్షంగా ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో మేలు చేసిన‌ట్టేన‌ని అన్నారు. ప్ర‌స్తుతం గొర్రెలు, మేక‌ల పెంప‌కం యూనిట్లు ఎంతో లాభ‌సాటిగా న‌డుస్తున్నాయ‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

కార్య‌క్ర‌మంలో ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ మాట్లాడుతూ, ప్ర‌తీ ఏడాది ఏప్రెల్ నెల‌ చివ‌రి శ‌నివారం ప్ర‌పంచ వెట‌ర్న‌రీ దినోత్స‌వాన్ని  నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ స్థాయిలో  ప‌శువైద్య రంగంలో విశేష కృషి చేసిన వారికి, ఈ సంద‌ర్భంగా అవార్డును ప్ర‌దానం చేయ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ, అందిస్తున్న‌ సేవ‌ల ప‌రంగా, రాష్ట్రంలో మొద‌టి మూడు స్థానాల్లో ఉంద‌ని తెలిపారు.

అనంతరం కార్య‌క్ర‌మంలో  ప‌శు మ‌త్స్య ద‌ర్శిని పుస్త‌కాన్ని క‌లెక్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌రివిడి ప‌శువైద్య క‌ళాశాల అసోసియేట్ డీన్ డాక్ట‌ర్ చెంగ‌ల్వ‌రాయుడు, డివిజ‌న‌ల్ డిప్యుటీ డైరెక్ట‌ర్లు డాక్ట‌ర్ రామ‌చంద్ర‌, డాక్ట‌ర్ ఆర్.నీల‌య్య‌, విటిసి డిడి డాక్క‌ర్ భాస్క‌ర‌రాజు, ఇంకా డాక్ట‌ర్ న‌రేష్‌, డాక్ట‌ర్ కృష్ణ‌, ప‌లువురు ఏడిఏలు, ప‌శు వైద్యులు, వారి కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ

Bhavani

ట్రాన్స్ఫర్: టీచర్ గంగయ్య సేవలు ప్రశంసనీయం

Satyam NEWS

మొదటి రోజు నాలుగు నామినేషన్లు

Satyam NEWS

Leave a Comment