18.7 C
Hyderabad
January 23, 2025 02: 26 AM
Slider ప్రత్యేకం

ఆబ్సెంట్: నేడు సిబిఐ కోర్టుకు రాని జగన్

jagan jail

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసు ఫిబ్రవరి 7 వ తేదీకి వాయిదా పడింది. వై ఎస్ జగన్ నేడు కూడా సిబిఐ కోర్టు ఎదుట హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా దాన్ని సిబిఐ కోర్టు తోసి పుచ్చింది. హోదాతో సంబంధం లేకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఈ తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు లో మినహాయింపు పిటీషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో నేడు కూడా జగన్ కోర్టు కు హాజరు కాలేదు. ఇదే విషయాన్ని చెప్పడంతో నేడు జగన్ ఆబ్సెంట్ పిటీషన్ కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

Related posts

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Murali Krishna

కమల వికాసానికి కలిసి వస్తున్న కాలం

Satyam NEWS

కొత్త ఏడాది ప్రారంభంలో మంత్రి బొత్స కొత్త సందేశం…!

Satyam NEWS

Leave a Comment