ఆంధ్ర ప్రదేశ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో మహాత్మా గాంధీ అని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి గాంధీ జయంతి కార్యక్రమంలో కొనియాడారు.
కడప జిల్లా రాజంపేట వైసీపీ కార్యాలయంలో శనివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి గాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ ఏపీకి రెండో మహాత్మాగాంధీ గాంధీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజాన్ని కొన సాగిస్తున్న,ఆచరిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దే అన్నారు. ఆయనకు అందరూ సహకరించాలి పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర బీసీ డైరెక్టర్ దాసరి చిదానంద గౌడ్ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుల్జార్ భాషా, రాజంపేట హాస్పిటల్ మాజీ చైర్మన్ వడ్డె రమణ, జెసిబి సుబ్బారెడ్డి , రాజంపేట హాస్పిటల్ డైరెక్టర్ ఖాజా మొహిదీన్, హస్తవరం ఉమా మహేశ్వర్ రెడ్డి , మిరియాల సురేఖ , మనుబోలు వెంకట సుబ్బయ్య , వీరబల్లి వీర నాగిరెడ్డి , ధనుంజయ నాయుడు, శివరామరాజు, రాజంపేట నియోజకవర్గంలోని వైయస్సార్ సిపి ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.