నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 72వ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి పేదల ఆశాజ్యోతి రైతు బాంధవుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిఅని, 10 సంవత్సరాల పాలనలో పేద మధ్యతరగతి వారికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడని, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు, పేదలకు పెన్షన్లు, ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ పథకం చెరగని ముద్ర వేశాయని, ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా SC సెల్ అధ్యక్షులు జగన్, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్. అధ్యక్షులు అనిల్ గౌడ్,పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు షాకీర్,పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, సెవాదల్ అధ్యక్షులు ఆరీఫ్,నాయకులు పాండురంగారెడ్డి, పి.శేఖర్, విష్ణు,NSUI నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.