సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని వైయస్ జగనన్న యువజన కమిటీ ఆధ్వర్యంలో వైయస్సార్ 71వ జయంతి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ ఎస్ జగనన్న జిల్లా యువసేన కమిటీ అధ్యక్షుడు సుతారి శ్రీనివాస రావు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయకుడు అవార్డు గ్రహీత గోపనబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ అభివృద్ధి ప్రదాత అని, జన హృదయ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద, మధ్యతరగతి కుటుంబ జీవితాలు బాగుపడే విధంగా గొప్ప మార్పులు చేసి ప్రజారంజకమైన పాలన సాగించిన నాయకుడని అన్నారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా కీర్తి సంపాదించిన వ్యక్తి అని కొనియాడారు.
మాట తప్పక మడమ తిప్పక ప్రభుత్వ ఖజానాపై భారంపడినా పేద ప్రజలు సుఖంగా ఉండాలని ఆలోచించిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఒక్కరే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ రామకృష్ణ, షేక్ మస్తాన్, పొదిళ్ళ శ్రీధర్, పాశం నరసింహారావు, యం. కోటేశ్వరరావు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.