రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టిన వై ఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.
మూడు రోజుల దీక్షకు షర్మిల ఉపక్రమించినా పోలీసుల అనుమతి ఒక్క రోజుకే ఉంది. దాంతో నేడు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.
అనుమతి ఒక్క రోజుకే అనుమతి ఉందని, దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు.
అయినా సరే ఇందిరాపార్క్ నుంచి లోటస్పాండ్కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించారు.
దీంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద షర్మిలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.