తాను పెట్టబోయే పార్టీకి వస్తున్న స్పందనకు షర్మిలారెడ్డి ఎంతో సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలకు వస్తున్న వారిలో ముఖ్యమైన నాయకులు లేకపోయినా కొత్త తరం నాయకులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
విద్యార్ధులతో ఇటీవలె ఇంటరాక్షన్ ముగియగా రాబోయే రోజుల్లో మరిన్ని టార్గెట్ గ్రూప్ లతో సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు.
దాదాపుగా అన్ని జిల్లాల సమావేశాలు ముగిసే లోపు పార్టీ పేరు ఇతర విషయాలపై క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు.
ఆ తర్వాత పాదయాత్ర చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ లో మళ్లీ పాదయాత్ర చేయడం కన్నా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు.
వీటన్నింటితో బాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయాలని షర్మిలపై వత్తిడి పెరిగిపోతున్నది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ లోపు పార్టీ కి అనుమతి వస్తే సరి లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్ధితో నైనా బరిలో దిగాలని చాలా మంది షర్మిలకు సూచిస్తున్నారు.
నేరుగా ఎన్నికలలో పోటీ చేయడం అనేది పార్టీకి మరింత ఉత్సాహాన్నిస్తుందని అంచనా వేస్తున్నారు.
బహుశ నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో వై ఎస్ షర్మిల పార్టీ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.