ఏప్రిల్ 9వ, తేదీన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరప తలపెట్టిన షర్మిలమ్మ సంకల్పసభ పోస్టర్ ఆవిష్కరణ వై.యస్.ఆర్ షర్మిలమ్మ పార్టీ అడహక్ కమిటీ సభ్యుడు ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా చౌక్ సెంటర్ నందు దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం S.R లాజిస్టిక్స్ కార్యాలయంలో సంకల్పం సభ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.షర్మిలమ్మ ఆధ్వర్యంలో జరిగే సంకల్ప సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వైయస్సార్ షర్మిలమ్మ పార్టీ ఏర్పాటు, జండా, ఎజెండా గురించి సంకల్ప సభ ద్వారా తెలియజేస్తారని అన్నారు.నీళ్ళు,నిధులు,నియామకాలు అంటూ ఎందరో మలిదశ ఉద్యమ కారుల ప్రాణ త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని,సంతోషంగా ఉండాల్సిన ప్రజలు సంతోషంగా లేరని అన్నారు.
తెలంగాణ ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో అధికార,ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని, త్వరలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దీవెనలతో వైయస్ షర్మిలమ్మ నాయకత్వంలో రాజన్న సంక్షేమ పాలన ధ్యేయంగా ఆవిర్భవించబోయే వైయస్సార్ షర్మిలమ్మ పార్టీనే దీనికి ప్రత్యామ్నాయం అని అన్నారు.
2014 లో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంత వైయస్సార్ అభిమానులు స్వచ్ఛందంగా 30 వేల పైచిలుకు ఓట్లు వేశారని గుర్తు చేశారు.అమితమైన అభిమానం ఉన్న ఈ గడ్డ మీద వైయస్ షర్మిలమ్మ పార్టీ జెండా ఎగరటం తథ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస రెడ్డి గురువు మేరెడ్డి ఎల్లారెడ్డి, దొంతగాని రాజా రమేష్, అంజి,కోటి, కందుల నరసింహారెడ్డి, శాగం రెడ్డి కోటిరెడ్డి, వీరం రెడ్డి నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, శివారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, సోమగాని ఉపేందర్, సుతారి శ్రీనివాస్, మారగాని సైదులు, సత్యం, గండ్ర శ్రీనివాస్ రెడ్డి, హనీఫ్, యాసీన్, అహ్మద్, పాశం గోవర్ధన్ రెడ్డి, చింతలపాలెం తిరుపతిరెడ్డి, ఇంద్రా రెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన వైయస్సార్ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.