తన కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నుంచి తల్లి వై ఎస్ విజయలక్ష్మి తప్పుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తన కుమారుడి పార్టీ అయి వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆమె ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తన కుమార్తె వై ఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.
షర్మిల పార్టీకి మద్దతుగా ఎల్లుండి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్ ముఖ్యనేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైఎస్సాఆర్ కి అతి దగ్గరగా ఉన్న నేతలకు ఆహ్వానం పలికారు. అక్కడే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆ పదవికి రాజీనామా చేసి తన కుమార్తె ప్రారంభించిన వైఎస్ఆర్టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.