40.2 C
Hyderabad
April 19, 2024 17: 53 PM
Slider కృష్ణ

బాధ్యతారహితంగా వీడియోలు చేస్తున్న జర్నలిస్టు సాయి

#yvb rajendra prasad

నీలి బ్యాచ్ వైరల్ చేసిన పుకారులో నిజానిజాలు తెలుసుకోకుండా జర్నలిస్టు సాయి అనే వ్యక్తి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏపి పంచాయితీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై వి బి రాజేంద్రప్రసాద్ అన్నారు.

‘‘పార్టీ మారితే 300 కోట్లు ఇస్తామన్నారు’’ అని తాను అన్నట్లు నీలి మీడియా ఒక ఫేక్ వార్తను ప్రచారం చేసింది. ఆ ఫేక్ వార్తను సీనియర్ జర్నలిస్టుగా చెప్పుకునే సాయి మరింత విస్తృతంగా ప్రచారం చేశాడని వై వి బి అన్నారు. ఆ ఫేక్ న్యూస్ పై సాయి ఒక వీడియో చేసి ‘‘నీకాడ ఏముందని 300 కోట్లు ఇస్తారు?’’ అని ఎటకారంగా అడిగాడని వై వి బి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో చూసిన తాను సాయికి ఫోన్ చేసి అడిగానని అయితే దానికి సాయి సరైన సమాధానం చెప్పలేదని వై వి బి రాజేంద్రప్రసాద్ అన్నారు. సాయికి ఫోన్ చేసి .. నేను ఆ మాట అన్న వీడియో చూపించు అంటే .. ఎక్కడో చూశాను తెలీదన్నాడు.. ఇలా ఏమీ తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తావా అనడిగితే నోరు మూసుకున్నాడు అని ఆయన అన్నారు.

తాను ఫోన్ తర్వాత సాయి వివరణ ఇచ్చుకుంటా వీడియో చేశాడని ఆయన చెప్పారు. అయితే దీంట్లో ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన వైసీపీ వారి గురించి చెబుతున్నాడు తప్ప .. అదే ఫేక్ ఇతనూ స్ప్రెడ్ చేశాడనే విషయాన్ని చెప్పట్లేదని వై వి బి అన్నారు.

గురివింద .. అసలు ఏమీ తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగటమే ఓ తప్పైతే .. మళ్లీ వివరణ ఇచ్చేప్పుడు కూడా తనూ తప్పుచేశానని చెప్పకుండా కేవలం ఎదుటోళ్లకి నీతులు చెబుతున్నాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

సర్పంచ్ ల హక్కులకై వ్యవస్థలో కొన్ని కీలక మార్పులకోసం పోరాడిన తాను.. డబ్బు కోసం మాటాడే సాయి లాంటి వారికి వివరణ ఇవ్వాల్సి రావటం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

అవనికి చైతన్యం అమ్మ

Satyam NEWS

కందుకూరు బాధిత కుటుంబాలకు NRI TDP సాయం

Bhavani

రెండు రోజుల సీఐడీ కష్టడీకి చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment