కరోనా మహామ్మారిని కట్టడి చేయడంలో రాజంపేట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సేవలను గుర్తించి స్వచ్ఛంద సేవకులు ఏపీ రాష్ట్ర అఖిల భారత యాదవ మహా సభ కార్యదర్శి బారతాల శ్రీధర్ బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 25 కేజీ ల బియ్యం బస్తాను 45 మందికి అంద జేశారు.
బుధవారం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గొబ్బిళ్ళ త్రినాథ్, హిమగిరి, రాము యాదవ్, ఎన్టీఆర్ కేశవ, ఛుక్కా యానాది, పోలి శివకుమార్, మందపల్లె శ్రీను, రమణయ్య, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరైనారు.
ఈ సందర్భంగా మీడియా మిత్రులు ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డిని కండువాతో సత్కరించగా,యాదవ సంఘం నేతలు శ్రీకృష్ణుని చితపటాన్ని బహుకరించారు.