24.7 C
Hyderabad
September 23, 2023 02: 48 AM
Slider ఆంధ్రప్రదేశ్

గనుల దొంగ కేసు సిబిఐకి బదిలీ

pjimage58

తెలుగుదేశం పార్టీ నాయకుడు, చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు జిల్లా, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కేసుల విచారణను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం వైఎస్ జగన్ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడులో ఆయన అక్రమంగా గనులను తవ్వి, వందల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. యరపతినేనిపై ఆరోపణలు తీవ్రమైనవని కోర్టుకు సర్కార్ వివరించింది. అందుకే ఈ దాచేపల్లి అక్రమ మైనింగ్‌ కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ఇకపై సీబీఐ ఈ కేసును చూసుకుంటుందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఇదే తొలి సీబీఐ విచారణ.

Related posts

గిరిజన కుటుంబాలకు 25.16 లక్షల దోమతెరలు

Sub Editor

“అక్షత శ్రీనివాస్ ఆదరగొట్టింది” అనిపించుకోవాలి

Satyam NEWS

అక్రమాలు చేసిన వారే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!