27.7 C
Hyderabad
April 18, 2024 09: 58 AM
Slider గుంటూరు

నరసరావుపేటలో టీడీపీ నేతలపై వైసీపీ పాశవిక దాడి

chadalavada 11

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నామినేషన్ వేయడానికి వెళ్లిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి, గూడూరు శేఖర్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వేయడానికి వెళుతున్న తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ వైసిపి వాళ్లు అడ్డుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల నామినేషన్లను అడ్డుకుంటున్నారన్న సమాచారం అందుకుని నరసరావుపేట ఎండిఓ కార్యాలయానికి వెళుతున్న నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నరసరాపుపేట నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల దాడులతో ఈ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. నరసరావుపేట ప్రాంతంలో ఎక్కడిక్కడ తెలుగుదేశంపార్టీ నాయకులను అడ్డుకోవడం దారుణమైన విషయమని డాక్టర్ చదలవాడ అన్నారు.  

Related posts

7 న సరూర్ నగర్ స్టేడియంలో మ్యూజిక్ హంగామా

Satyam NEWS

పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు

Satyam NEWS

కొల్లాపూర్ లో అధికారి సంతకం ఫోర్జరీ: అయినా పోలీస్ కేసు లేదు

Satyam NEWS

Leave a Comment