అన్నమయ్య జిల్లా రాజంపేటలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వైబియన్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ గణపతి అ భయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్లే కార్డులు చేత పట్టి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి అధికారిక వెబ్సైట్లో శివరాత్రి పర్వదినాన చేసిన పోస్ట్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు బీజేపీ శ్రేణులు వైయస్ జగన్ హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని,పార్టీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
హిందువులు ఓట్లు కావలసినప్పుడు గుళ్ళకు వెళ్లి దేవుళ్ళు మొక్కడం శివలింగాలకు అభిషేకం చేయడం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇలా వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా శివునికి అభిషేకాలు చేయడం కన్నా ప్రజలకు పాలు పంచిపెట్టడం బాగుంటుందని ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం అర్థం అవుతుందని ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా హిందువులు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా చేశారు.
ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసేలా పరమేశ్వరుడికే పాలు పట్టి శివతత్వాన్ని అవమానించేంత స్థాయికి జారిపోయిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగుల ఆదినారాయణ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి సూర్యచంద్ర బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు తోట నగేష్ బిజెపి బిజెపి పట్టణ కార్యదర్శి పి రమణ బిజెపి మండల ఉపాధ్యక్షులు డాక్టర్ రేణు ప్రసాద్ రాజు బిజెపి నాయకులు పి. నాగేశ్వరరావు పి. నాగేంద్ర ఎస్. బాబు చంద్ర తదితరులు పాల్గొన్నారు