గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఉన్న కల్లూరి చంద్రమౌళి కూరగాయలు మార్కెట్ పేరు మార్చి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్యే విడదల రజని, మునిసిపల్ ఛైర్మన్ రఫాని ఉద్దేశ్య పూర్వకంగా ఇటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడమే పెద్దతప్పు అని అన్నారు.
1948 లో పెట్టిన చంద్రమౌళి పేరు మార్చి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. కల్లూరి చంద్రమౌళి స్వాతంత్ర్య సమర యోధుడు గా, మంత్రిగా పనిచేసిన గొప్ప నేత అని ఆయన టైం లో వైఎస్ రాజశేఖర్రెడ్డికి నిక్కర్లు వేసుకునే వయసు కూడా ఉండదని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
అటువంటప్పుడు చంద్రమౌళి పేరు తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరు ఎలా పెడతారని రావు సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. మునిసిపల్ కౌన్సిల్ లో అజెండాగా పెట్టిన అంశాలపై చర్చ లేకుండానే ఆమోదించుకుంటే ఇంకా సమావేశాలు ఎందుకని అన్నారు.
ఈ అంశంలో నిర్ణయం మార్చుకుని చంద్రమౌళి పేరునే కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించాలని,లేకుంటే జిల్లా కలెక్టర్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఉద్యమిస్తామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.
అవసరం అయితే న్యాయ స్థానాన్ని ఆశ్రయించయినా కూరగాయలు మార్కెట్ చిరువ్యాపారులకు అండగా నిలుస్తామని,పేరు మార్పుకు కృషి చేస్తామని తెలిపారు.