ప్రభుత్వ మాజీ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణ రెడ్డి నిన్న శుక్రవారం మధ్యాహ్నం రైతులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన స్థానిక లక్ష్య ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు విచారం వ్యక్తం చేశారు.
పలువురు నాయకులు చరవాణి ద్వారా మాజీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. అనునిత్యం రైతు సేవకుడు ముఖ్యమంత్రి కి నమ్మిన బంటు అంబటి కృష్ణ రెడ్డి కి ఇలా జరగడం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.