ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బంది కంచికచర్ల గ్రామంలో విద్యుత్ బిల్లులు కట్టని వారి ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లు కట్టమని అడుగుతున్నారు. ఈ క్రమంలో కంచికచర్ల వైఎస్ఆర్సిపి నాయకుడు కంచికచర్ల పంచాయతీ 20 వవార్డు మెంబర్ బర్రె శంకర్ ను కూడా అడిగారు. కరెంటు బిల్లు కట్టడం అటుంచి ఆయన విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడి చేశారు.
ఈ విషయంపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు మరియు పోలీస్ శాఖ స్పందించి విధి నిర్వహణలో ఉన్న వ్యక్తులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని కాదని వ్యాఖ్యానించారు. తమ విధులు నిర్వహించేటప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు సమస్యను పోలీసు వారి దృష్టికి తీసుకురావడం తో వెంటనే ఎఫ్ఐఆర్ 379/2022 సెక్షన్ 353 506r/w 34 ఐపిసి క్రింద కేసు నమోదు చేశారు.