ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వార్డులో సౌకర్యాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరణం వెంకటేష్ నేడు పరిశీలించారు.
ఐసోలేషన్ వార్డులోని కరోనా రోగులను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
అక్కడ వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వాకబు చేశారు. వారికి ఆక్సీజను సరిపడా అందుబాటులో ఉందాలేదా అని ఆసుపత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
కరోనా రోగులకు ప్రభుత్వం అందచేసే పౌష్టికాహారం సరిగా అందుతుందా లేదా అని కనుక్కున్నారు.
అనంతరం వైద్యశాల సూపరింటెండెంట్ తో కలిసి రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.