27.7 C
Hyderabad
April 24, 2024 10: 35 AM
Slider గుంటూరు

నరసరావుపేట నియోజకవర్గంలో బరితెగించిన నాయకులు

#Dr.Aravindababu

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు పెరిగిపోయాయని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్- ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆరోపించారు.

ఇస్సాపాలెం పరిధిలోని శిశు మందిర్ వద్ద  అధికారుల దగ్గర ఉండి గృహాల ముందు భాగం డ్రైనేజీ, మెట్ల తొలగించారని, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు మేరకు పడేసామని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.

డబ్బులు అడిగితే ఇవ్వలేదని అన్యాయంగా మా ఇళ్ల ముందు మెట్లు, రాంప్ అక్రమంగా కూల్చివేశారని బాధితులు చెబుతున్నట్లు అరవిందబాబు తెలిపారు.

పంచాయితీ సెక్రెటరీ మరియు పోలీస్ అధికారులు కలసి అన్యాయంగా కూల్చివేశారని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికార దాహంతో అవినీతి కి పాల్పడుతున్నారని అరవిందబాబు ఆరోపించారు.

ప్రతి పనికి ఓ రేట్ పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని, పది లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారని బాధితులు తెలిపారని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంటనే అరెస్ట్ చెయ్యాలని అరవిందబాబు డిమాండ్ చేశారు.

Related posts

25వ జాతీయ అటవీ క్రీడల్లో తెలంగాణకు 16 పథకాలు

Satyam NEWS

కలాం రూట్: సామాజిక స్పృహ, జాతీయ భావన అవసరం

Satyam NEWS

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

Bhavani

Leave a Comment