పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన శిఖా బెనర్జీ ని పలువురు వైసీపీ నాయకులు నేడు ఇక్కడ అభినందించారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనపరచాలని వారు ఈ సందర్భంగా ఆయనను కోరారు. తద్వారా సమాజానికి మంచి సందేశం వెళుతుందని, నేరం చేయాలంటే భయపడే రోజు వస్తుందని వారన్నారు.
ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శిఖా బెనర్జీని కలిసిన అభినందించిన వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఉన్నారు. ఆయనతో బాటు గుంటూరు పార్లమెంట్ YSRCP అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, వేమూరు ఎమ్మెల్యే మేరుగా నాగార్జున తదితరులు ఉన్నారు. తనను అభినందించిన నాయకులకు శిఖా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.