కడప జిల్లా రాజంపేట మండలం మందరం సీతారామ పురం లో రాష్ట్ర వైసీపీ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తంబెల్ల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ వితరణ కార్యక్రమం జరిగింది.
ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ మెంబర్ మేడా మల్లిఖార్జున రెడ్డి ,వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి,ఆర్థివో ధర్మచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.