రోజు కూలీ పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో వైసీపీ నార్త్ అమెరికన్ అధికార ప్రతినిధి రత్నాకర్ వారికి ఆపన్న హస్తం అందించారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్ళపాక పంచాయితీ లోని నిరుపేద కుటుంబాల వారికి ఆయన యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
దాదాపు 200 కుటుంబాలకు రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిత్యా వసర సరుకులు పంపిణీ చేశారు.