పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం చెలరేగింది. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై కాల్పులు జరిపారు. ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపిన ప్రత్యర్ధులు పరారయ్యారు.బాలకోటి రెడ్డికి బులెట్ గాయాలు తగలడం తో నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాల్పులో పాల్గొన్నది గడ్డం వెంకట్రావు,పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి,పూజల రాముడు గా గుర్తించారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్న బాల కోటిరెడ్డి పనిచేశారు.
పక్క ప్లాన్ తో రొంపిచర్ల వైసిపి ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు,అతని అనుచరులు దాడి చేశారని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి ని ఆయన పరామర్శించారు. వెన్న బలకోటి రెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనే అని ఆయన అన్నారు. బలకోటి రెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత అని తెలిపారు.