ఆనందయ్య మందు అమ్ముకోవడానికి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్లాన్ చేశారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించగా దానిపై తీవ్ర విమర్శలతో ఆయన సమాధానమిచ్చారు.
సోమిరెడ్డికి సిగ్గు, శరం ఉందా అంటూ ప్రశ్నించిన కాకాని గోవర్ధన్ రెడ్డి రాయలేని విధంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మేము నిజాయితీగా పుట్టాం .. నువ్వు నీతిగా నిజాయితీగా ఒక అమ్మకు… అబ్బకు పుట్టి ఉంటే రా తేల్చుకుందాం….అంటూ సవాల్ విసిరారు.
ఇప్పటికి నాలుగుసార్లు ఓడిపోయావు అయినా నీకు సిగ్గు శరం రాలేదు… నీకు దమ్ము ధైర్యం ఉంటే రా 2024 లో తేల్చుకుందాం….నిన్ను మట్టి కరిపిస్తాం…అని ఆయన సవాల్ చేశారు.
శ్రేశితా టెక్నాలజీ ఎవరిదో తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు.