37.2 C
Hyderabad
April 19, 2024 12: 28 PM
Slider నెల్లూరు

పోలీసు సంఘ నేతలు ఎక్కడ దాక్కున్నారు?

#BeedaRavichandra

దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం  అమలులో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో  మాత్రం జగన్ రాసుకున్న  రాజ్యాంగం నడుస్తోందని టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం లో నేడు విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా కు కలెక్టర్ , ఎస్పీ ఉన్నారా! లేరా ? ఉంటే వారికి అధికారాలు ఉన్నాయా! లేవా ? డీజీపీ , చీఫ్ సెక్రటరీ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కలెక్టర్, ఎస్పీ లను మేము గుర్తించం అని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటనలు  ఇస్తున్నారు, కలెక్టర్, ఎస్పీ లను ప్రజలు  గుర్తించాలో వద్దో  ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నువ్వెవరు ? జిల్లాలో నీకేం అధికారం ? అధికారులపై చర్యలు తీసుకుంటే నీ అంతు చూస్తామని ఎమ్మెల్యేల హెచ్చరికలు దేనికి సంకేతం ? అని ఆయన ప్రశ్నించారు.

కలెక్టర్ ఎస్పీలను లక్ష్యం చేసుకోవడం లో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆంతర్యమేంటి ? అని రవిచంద్ర ప్రశ్నించారు. ఏసీ గదుల్లో కలెక్టర్, ఎస్పీ పనిచేస్తున్నారని చెబుతున్న ప్రసన్నకుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి తాడేపల్లి లో పని చేస్తున్నారా?  లేక రాష్ట్రమంతా తిరిగి పనిచేస్తున్నారో  స్పష్టం చేయాలని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీలను వైసీపీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా చేసుకుంటే  పోలీస్, ఉద్యోగ సంఘాల అసోసియేషన్ నేతల్లో కనీస స్పందన లేదు ఎందుకని ? 9 మాసాలుగా ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య మాట్లాడితే రాజకీయ డ్రామాలు ఆపమని , నీ అంతు చూస్తామని  హెచ్చరించిన అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు నేడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశం లో  జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి , TNSF జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు , అమ్రుల్లా  పాల్గొన్నారు.

Related posts

ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ ముందు మహిళ మోర్చా నాయకుల ధర్నా

Satyam NEWS

ప్రపంచ సంపన్నుడిగా మళ్లీ ఎలాన్ మస్క్

Satyam NEWS

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ధ్వసం

Satyam NEWS

Leave a Comment