రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే వైసిపి నాయకులు జగన్ కు కట్టుబానిసలుగా ఊడిగం చేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసన సభ్యులు డా. నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిని, 30 వేల ఎకరాల రైతుల త్యాగాన్ని ఆనాడు స్వాగతించిన ముఖ్యమంత్రి జగన్ నేడు ఎందుకు మాట మార్చాడు ? ఎందుకు మడమ తిప్పాడు ? అని ఆయన ప్రశ్నించారు.
మేనిఫెస్టో భగవద్గీత , ఖురాన్ , బైబిల్ అనేది మాటల వరకే తప్ప చేతలలో వైసిపి చూపించలేదా ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన కంటే రాష్ట్రనికి 3 ముక్కల రాజధాని తోనే ఎక్కువ నష్టం కలుగుతుందని రామానాయుడు అన్నారు. ఓట్లు వేయించుకొన్న ప్రజలను మోసం చెయ్యడం ప్రజా ద్రోహం, నమ్మక ద్రోహం , వెన్నుపోటు పొడవడం కదా ? కుట్రలు , అనైతిక స్నేహం, తప్పుడు ప్రచారం తో వచ్చిన అధికారం పోతుందని అని వైసిపి భయపడుతుందని ఆయన అన్నారు.
అమరావతి సృష్టించే లక్ష కోట్ల సంపదను నాశనం చేసే హక్కు మీకేవరిచ్చారు? మీ అవినీతి సంపద లక్ష కోట్లు కావాలంటే నాశనం చేసుకోండి, కానీ ప్రజల సంపద లక్ష కోట్లు నాశనం చేస్తామంటే సహించం అని రామానాయుడు హెచ్చరించారు.
దమ్ముంటే చంద్రబాబు సవాల్ ను స్వీకరించి, రాజధాని మార్పుపై ప్రజా తీర్పు అడిగే ధైర్యం జగన్ కు ఉందా ? మీ 3 ముక్కల నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తే మీ నిర్ణయాన్ని మేమే కాదు ఎవరు ప్రశ్నించరని ఆయన అన్నారు.