32.2 C
Hyderabad
March 29, 2024 00: 14 AM
Slider చిత్తూరు

పాదయాత్రకు ముందే ఫ్లక్సీలు చించేసిన వైసీపీ మూకలు

#yuvagalam

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే వైసీపీ మూకలు తమ ప్రతాపం చూపించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతుండగా అక్కడ వైసీపీ మూకలు టెన్షన్ సృష్టించాయి. నారా లోకేశ్ పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసిన వైసిపి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మరికొద్ది సేపట్లో నారా లోకేశ్ పాదయాత్ర మొదలు కాబోతున్న సమయంలో ఈ  ఘటన జరగడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తం అయ్యారు.

ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. లోకేష్ కు రక్షణగా తెలుగుదేశం పార్టీ 200 మంది ప్రైవేటు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నది. అనుక్షణం ఆయన భద్రత కోసం 400 వాలంటీర్లను సిద్ధం చేసుకున్నారు. నారా లోకేశ్ పాయాత్రకు భారీ ఏర్పాట్లు చేసారు. లోకేశ్ పాదయాత్ర కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. కుప్పం నుంచి 400 మంది వాలంటీర్లు లోకేష్ ను అనుసరించనున్నారు. పాదయాత్ర వేళ లోకేశ్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారవాన్ సిద్దం చేసారు. సకల హంగులతో దీనిని ఏర్పాటు చేసారు. తొలి రోజు యాత్ర, బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు పాల్గొనున్నారు. ముందుగానే కుప్పం చేరుకున్న పార్టీ నేతలు బహిరంగ సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. సభా వేదిక పై 300 మంది ఆశీనులు కానున్నారు. అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తున్నారు.

Related posts

స్వచ్ఛతను పెంచుదాం, పచ్చదనం కాపాడుకుందాం

Satyam NEWS

పివికి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం

Satyam NEWS

వైభవోపేతంగా శ్రీ సంజీవరాయ స్వామి వారి పొంగళ్ళు

Satyam NEWS

Leave a Comment