28.7 C
Hyderabad
April 24, 2024 03: 30 AM
Slider సంపాదకీయం

ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వైసీపీ సర్పంచ్ లు

YCP sarpanches who have turned against the government

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సైతం దారిమళ్లిస్తున్న వైసీపీ ప్రభుత్వం పై సాక్ష్యాత్తూ అదే పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ లే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయితీ నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని తుంగలో తొక్కిందని వైసీపీ కి చెందిన సర్పంచ్ లు అంటున్నారు. సొంత ప్రభుత్వంపై ఢిల్లీలో ఫిర్యాదులు చేసేందుకు వెళ్తున్నారు. అదే విధంగా ఢిల్లీలో ధర్నాలు చేయాలనుకుంటున్నారు. పంచాయతీల ఆదాయం మొత్తం ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా తమకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా గ్రామ

సచివాలయాలను ఏర్పాటు చేసి వాటికి విస్తృత అధికారాలు కట్టబెట్టడంపై వైసీపీ సర్పంచ్ లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్పంచ్‌లు విజయవాడలో సమావేశమయ్యారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని పంచాయతీలను నిర్వీర్యం చేయడం ద్వారా జగన్ నాశనం చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల గ్రామ సచివాలయాలకు మాత్రం రూ. ఇరవై లక్షలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సర్పంచ్‌లు మరింత రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన కేంద్ర నిధులను

పంచాయతీలకు తిరిగి జమ చేయాలని ఆందోళనలు ప్రారంభించారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేక ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు వాపోతున్నారు. కేంద్రప్రభుత్వం 14,15 ఆర్ధిక సంఘం కింద పంచాయతీలకు ఇచ్చిన నిధులను విద్యుత్‌ బకాయిల పేరుతో నేరుగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు మళ్లించారు. సర్పంచులకు తెలియకుండా, రాజ్యాంగ విరుద్ధంగా నిధులు మళ్లించేందుకు ఆర్ధికశాఖ జీవోలు ఇచ్చింది. కరెంటు బిల్లు కోసం చెల్లించి ఉంటే పంచాయతీలకు రశీదులు ఎందుకు ఇవ్వలేదని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్‌ బిల్లుల బకాయిల రికవరీ అన్నది పచ్చి బూటకమని, ఆ పేరుతో పంచాయతీల నిధులు దారిమళ్లించి ముఖ్యమంత్రి సొంత పథకాలకు వాడుకుంటున్నారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ నేతలు ఇలా రోడ్డెక్కడాన్ని వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోడం లేదు. వైసీపీ సర్పంచ్‌లు అంతా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి గెలిచిన వాళ్లే. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన వాళ్లే. రేపు గ్రామాల్లో ఓట్లు వేయించాల్సింది కూడా వాళ్లే. అయినా ఎందుకు జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందో కానీ.. వారు మాత్రం మాకు ఇదేం ఖర్మ అనుకుంటున్నారు.

Related posts

ఖాళీల భర్తీ… నిరుద్యోగ భృతి కోసం…‘ కోటి సంతకాల సేకరణ’

Satyam NEWS

ఎంఆర్ఓ మోసంతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించిన లోకేష్

Satyam NEWS

Leave a Comment