28.7 C
Hyderabad
May 15, 2024 00: 13 AM
Slider నెల్లూరు

బిజెపి వైఖరిపై పోరాటానికి రెడీ అవుతున్న వైసిపి

sridhar reddy

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసినట్టుంది. భారతీయులపాలిట ఉరితాడులా CAA, NRC, NPR చట్టాలు భారతీయుల పాలిట ఉరితాడులా మారాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వీటి అమలుకు వ్యతిరేకంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

అందుకే CAA, NRC, NPR లో అభ్యంతరకరమైనవి అమలు చేయవద్దని స్పష్టంగా జి.ఓ. జారీ చేశారని ఆయన అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేడు ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ చట్టంపై రాకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పాల్గొంటారని ఆయన తెలిపారు.

Related posts

రాజ్యాంగ గర్జన వాల్ పోస్టర్ విడుదల

Satyam NEWS

నెక్స్ట్ జెన్: తెలుగుదేశం పార్టీ యువ నేతలకు లోకేశ్‌ విందు

Satyam NEWS

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు

Satyam NEWS

Leave a Comment