మాన్సాప్ భూ ఆక్రమలపై తెలుగు దేశం పార్టీ ఆరోపణ
దేశంలోఅదే ఏపీ రాష్ట్రంలో దొంగలు పడ్డారని…మరీ ముఖ్యంగా రాజధానిలో పెద్ద గజదొంగ ఉన్నారంటూ విజయనగరం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఎండోమెంట్ శాఖ కుచెందిన మాన్సాప్ ఆధ్వర్యంలో ఉన్న స్థలాలను అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్రమించుకుంటోందని..తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు ఐవీపీరాజు, నర్సింగరావు, కనకల తదితరులు మాట్లాడారు.
నగరంలోని కోట, పెద్ద చెరువు ప్రాంతంలో ఉన్న మాన్సాస్ కు చెందిన భూముల్లో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా కొలతలు తీయడం సరికాదన్నారు. కోట చుట్ట ఉన్న కందకాన్ని అలాగే పెద్ద చెరువు వద్ద స్థలాన్ని… యంత్రాలతో చదును చేయించడాన్ని తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఏవి మాన్సాస్ స్థలాల్లో..ఏవి ప్రభుత్వ స్థలాల్లో అటు ఎండోమెంట్ కమీషనర్ కు ఇటు మున్సిపల్ కమీషనర్ కు తెలుసునని టీడీపీ నేతలు స్పష్టం చేసారు.