రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ చతుష్టయ సభ్యులైన జగన్ రెడ్డి, సజ్జల, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లు రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా పాలిస్తున్నారని ఆయన అన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ముందే తెలుసుకున్న జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మరింత అప్పుల ఉభిలోకి నెట్టాలని చూస్తున్నాడని యనమల అన్నారు.
కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ రెడ్డిది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారని యనమల విమర్శించారు. రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుని పోయిందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి అడ్డగోలుగా తీసుకుంటున్న రుణాలను నిరోధించకపోతే రాష్ట్రానికి కొలెటరెల్ ఆర్థిక నష్టం జరగడం ఖాయమని ఆయన అన్నారు.
జగన్ రెడ్డి అవినీతి సొమ్ము కూడబెట్టుకుని రాబోయే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నాడని యనమల అన్నారు. వైసీపీ ప్రభుత్వం పతనం అంచున ఉందని, వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన తెలిపారు.