బిచ్కుంద మండలంలోని మిషన్ కల్లాలి సెట్లురు గ్రామాలలో శుక్రవారం శనగ కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు సామాజిక దూరం పాటించాలన్నారు.
అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులను సౌకర్యవంతంగా చేసిందని కావున రైతులు ఎవరూ ఇబ్బందులు పడకుండా తమ శనగలను అమ్ముకోవాలన్నారు. మాస్కులను ధరించి కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సహకరించాలని వారు ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్ సహకార సంఘం అధ్యక్షులు బాలాజీతో పాటు సర్పంచ్ సరస్వతి సంజయ్ కుమార్, ఎంపిటిసి సుజాత రాములు, సొసైటీ డైరెక్టర్లు సంజు చంద్రకాంత్, ఉప సర్పంచ్ నాగ్నాథ్, పార్టీ అధ్యక్షులు బీర్ గొండ నాయకులు, దర్పల్లి సంజు గ్రామ రైతులు పాల్గొన్నారు.