28.7 C
Hyderabad
April 25, 2024 06: 06 AM
Slider గుంటూరు

ప్రజలతో మమేకమైన నాయకుడు ఎర్రంనాయుడు

erramnaidu

ఎమ్మెల్యే నుండి ఎంపీగా, కేంద్రమంత్రిగా చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన తెలుగు కిరణం కింజరపు ఎర్రం నాయుడు అని నరసరావుపేట టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్రన్నాయుడు 63 జయంతి కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శాసన సభ నుండి లోక్ సభ వరకు ప్రజా సేవే పరమావధిగా ప్రజా సంక్షేమమే ఊపిరిగా జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన తెలుగు నాయకుడు ఆయన అని అరవింద బాబు అన్నారు. తెలుగు వారి గుండె చప్పుడు గా మారిన ఎర్రం నాయుడు చిరస్మరణీయుడని అన్నారు.

ఆయన చేసిన అభివృద్ధిని, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పులిమి రామిరెడ్డి, వల్లెపు నాగేశ్వరరావు, వాసిరెడ్డి రవి, కుమ్మెత కోటిరెడ్డి, శేఖేర్, మీరవాలి, ప్రసాద్, జీలని మాలిక్, మస్తాన్, అలీ, చిరంజీవి, బాలు, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

టెంటు… ఫ్రంట్ లేకుండా ఏం చేస్తవు సారూ?

Satyam NEWS

22లోగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి

Bhavani

[Professional] > Can The Doctors Prescribe Weight Loss Pills Keto Supplements Weight Loss 2 Week Weight Loss Pills

Bhavani

Leave a Comment