36.2 C
Hyderabad
April 16, 2024 19: 42 PM
Slider విజయనగరం

స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమంలో యోగా దినోత్సవం

#Yoga day

విజయనగరం జిల్లా సాలూరు లోని స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.

అపర వాల్మికి సద్గురు శ్రీశ్రీశ్రీ స్వామి శివానంద పరమహంసల వారి సమాధి ఆరాధన కూడా ఈ రోజునే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి జూన్ 21 ప్రపంచయోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే సద్గురు శివానంద పరమహంస కాలినడక యావత్ ప్రపంచం తిరిగి సిద్ద విద్య అయిన ప్రాణాయామమును ఉపదేశించారు.

ఈ క్రమంలో నే ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా సాలూరు కు రావడం జరిగినట్టు..వారి శిష్యులు మౌన స్వామి శ్రీ స్వామి రామానంద పరమహంసల వారు స్థాపించిన కామన్నవలస ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆశ్రమంలో అటు యోగా డే ఇటు శివానందుల వారి సమాధి ఆరాధన జరిగింది. కరోనా మూలంగా ఎవ్వరినీ పిలవకపోయినప్పటికీ…యోగా డే సందర్భంగా పరిమితం గానే కరోనా నిబంధనల ను పాటిస్తూ… ఆరాధన కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సద్గురు పూజ, శ్రీ గురుగీత, దక్షిణామూర్తి స్తోత్రం, సద్గురు పాదుకాస్తవమ్ పఠించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ, వారి సతీమణి పార్వతమ్మ, శిష్యులు మోహనరావు, శోభ, కెప్టెన్ లక్ష్మణరావు, డా.సుబ్రహ్మణ్యం, చక్రవర్తి, నారాయణ రావు, ఏఐఆర్ జర్నలిస్ట్ విజయగోపాల్ తదితరులు మాస్క్ లు ధరించి పాల్గొన్నారు.

Related posts

జగన్ రెడ్డి సర్కారుపై సర్పంచ్ ల మలిదశ పోరాటం

Satyam NEWS

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్ల ఆధ్వర్యంలో ర్యాలీ,మానవ హారం…

Bhavani

Special interview: ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అవసరమా?

Satyam NEWS

Leave a Comment