ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యం అందుబాటులో ఉండేలా యోగాను ప్రోత్సహిస్తున్నామని శ్రీ గురు యోగాలయం ట్రస్ట్, వ్యవస్థాపకులు శ్రీ యోగ గురు కే శివ కృష్ణ అన్నారు. శ్రీ గురు యోగాలయం ట్రస్ట్ అధ్వర్యంలో ములుగు కె శివ కృష్ణ సహకారంతో ఉచిత యోగ శిక్షణ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం అందుబాటులో ఉండేలా శ్రీ గురు యోగాలయంతో యోగాను ప్రోత్సహించడం కోసం ప్రయత్నిస్తున్నామని,ఈ కార్యక్రమాన్ని శ్రీ గురు యోగాలయం ట్రస్ట్ వ్యవస్థాపకుడు కె శివ కృష్ణ నిర్వహిస్తున్నారు. అతను యోగా శిక్షణ, సహజ చికిత్సలో 15 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ములుగులో ప్రతీ నెల మొదటి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉచిత యోగ శిక్షణా కార్యక్రమం నిర్వహింస్తున్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుని ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతీ వారం దేశ విదేశాలలో ఉచిత యోగ శిక్షణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఆన్లైన్లో 60 సంవత్సరాలు దాటిన పెద్దవారికి ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.